బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. జక్కన్న తన తదుపరి సినిమా ప్రిన్స్ మహేశ్ బాబుతో తీస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మామూలుగానే రాజమౌళి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు ఏవీ బయటకు రానివ్వడు. ఇక ఈ సినిమాకు కూడా అంతే పకడ్బందీగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వీడియోలు, ఫొటోలతో పాటు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా ఉండేందుకు హీరో, హీరోయిన్లతో సహా మూవీ టీం అందరి చేత నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేయించాడని టాక్ వినిపిస్తోంది. సినిమా గురించి ఎలాంటి వివరాలు బయటకు లీక్ చేయం అంటూ అగ్రిమెంట్లు చేయించుకొని షూటింగ్ చేయబోతున్నారు. ఎవరైనా అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక మూవీ సెట్లోకి వచ్చే వారిలో హీరో,హీరోయిన్లు మొదలు ఎవరైనా మొబైల్ తీసుకొచ్చినా అనుమతించరని టాక్ నడుస్తోంది.