కొత్త‌ బిజినెస్ స్టార్ట్ చేసిన రానా

సామాన్య ప్ర‌జ‌ల‌కు ఒక్క ఉద్యోగం చేసేందుకే త‌ల ప్రాణం తోక‌కొస్తోంది. కానీ కొంత మంది సెల‌బ్రెటీలు మాత్రం ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాలు, మ‌రో వైపు వ్యాపార రంగాల్లో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. తాజాగా ఈ కోవ‌లో సినీ న‌టుడు రానా కూడా చేరారు. తాజాగా రానా దంప‌తులు ఓ కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు. ఫుడ్ స్టోరీస్ పేరుతో ఓ దుకాణం తెరిచారు. బంజారాహిల్స్ లో తెరిచిన ఈ దుకాణంలో కూర‌గాయ‌లు, పండ్ల ధ‌ర‌లు చూస్తే షాక‌వ్వాల్సిందే. ఈ షాప్ ఓపెనింగ్‌కి రాజ‌మౌళి దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఇక ధ‌రల విష‌యానికొస్తే… కేజీ ట‌మాటాల ధ‌ర రూ.4250, ఒక్క కొబ్బ‌రి బొండం ధ‌ర రూ.1000, ఒక్క గ్లాస్ చెరుకు ర‌సం రూ.250 గా ఉంది. ఇక ఈ ధ‌ర‌లు చూసిన ఫ్యాన్స్ ఇది కేవ‌లం డ‌బ్బున్న వాళ్ల కోస‌మే స్టార్ట్ చేశార‌ని కామెంట్ చేస్తున్నారు. అయితే క్వాలిటీ, ఆర్గానిక్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఐటెమ్స్ ఉండ‌టం వ‌ల్ల‌నే ధ‌ర‌లు ఈ రేంజ్‌లో ఉన్నాయ‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *