ప్రముఖ రాజకీయ నేత జేసి ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవీ లత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. . ఇటీవల జరిగిన న్యూ ఇయర్ వేడుకల సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలపై మాధవీ లత ముందుగా కామెంట్లు చేశారు. దీనిపై ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాధవి లతా ప్రాస్టిట్యూట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాధవీ లత మా కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చాలా దారుణంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.