స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. పుష్ప పార్ట్ వన్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ టూ పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసేసింది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల నవంబర్ 25న పూర్తయ్యింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘నవంబరు 25 నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న రోజు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 24వ తేదీ సాయంత్రం మేమంతా షూట్ పూర్తి చేసుకొని చెన్నైలో ఈవెంట్కు హాజరయ్యాం. అదేరోజు తిరిగి హైదరాబాద్కు వచ్చేశాం. ఇంటికి వెళ్లి దాదాపు నాలుగు గంటలు నిద్రపోయా. ఉదయాన్నే నిద్ర లేచి ‘పుష్ప’ షూట్కు పరుగులు పెట్టా. ఈ సినిమాకు ఇదే నా ఆఖరి రోజు షూట్. స్పెషల్ సాంగ్ షూట్ చేశాం. రాత్రి వరకూ సెట్లోనే ఉన్నా. ఇది ఆఖరిరోజులా ఏమాత్రం నాకు అనిపించలేదు. గత ఐదేళ్లు ఈ సినిమా సెట్లోనే గడిపా. ఇది నాకొక ఇల్లులా మారింది. ఇప్పటివరకూ పడిన కష్టం, నీరసించిన క్షణాలు.. చివరిరోజు కావడంతో అన్నీ నా కళ్ల ముందు మెదిలాయి. ఓవైపు ఆనందం, మరోవైపు టీమ్, సెట్ని వీడుతున్నాననే బాధ.. ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నా మనసు నిండింది. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతిఒక్కరిని ఇకపై మిస్ అవుతా. ఎంతోకాలం తర్వాత బాధతో బాగా ఏడ్చేశా. నేనెందుకు ఆవిధంగా రియాక్ట్ అయ్యానో అర్థం కాలేదు’’ అని రష్మిక తన పోస్టులో రాసుకొచ్చింది.