కుమారి 21 ఎఫ్ తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. ‘అలా ఎలా’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఈమె టాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ‘కుమారి 21 ఎఫ్’ , ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హెబ్బా నటించింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో హిట్లు అందుకోలేకపోయింది. తర్వాత చాలా రోజులకు సంపత్ నంది నిర్మాణంలో వచ్చిన ‘ఓదెల’ ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ హెబ్బానే. కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఓదెల 2’ కూడా వస్తుంది. కానీ ఇందులో టాప్ హీరోయిన్ తమన్నా కూడా నటిస్తోంది. ఈ తమన్నా ఇందులో శివ శక్తిగా కనిపించనుంది. ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో సంపత్ నంది , దర్శకుడు అశోక్ తేజల ఫోకస్ కూడా ఆమె పైనే ఉందని టాక్ నడుస్తోంది. అందువల్ల హెబ్బా పాత్రని సైడ్ చేసేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా వరకు సినిమాలో హెబ్బా పాత్ర నిడివి కూడా తగ్గించారట. కీలక సన్నివేశాలు కూడా ఎడిటింగ్లో లేపేశారని సమాచారం. ఈ విషయం హెబ్బాకి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉందట. ఇక ‘ఓదెల 2’ ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతోంది. సినిమా విడుదలైతే అసలు విషయం అర్థం అవుతుంది.