టాలీవుడ్ టాప్ హీరోయిన్గా వెలుగొందిన తమన్నా బాలీవుడ్కి వెళ్లిపోయాక తెలుగులో సినిమాలు తగ్గించేసింది. తాజాగా తమన్నా నటిస్తున్న ఓ తెలుగు సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది మూవీ టీం. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్గా ఓదెల 2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా అఘోరీగా నటిస్తోంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ కూడా సంత్ నంది అందిస్తుండటం విశేషం. ఈ సినిమా టీజర్ను ప్రయాగ్ రాజ్లో మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో తమన్నా గెటప్ హైలైట్గా నిలుస్తోంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.