మాస్ క్యారెక్ట‌ర్‌తో వ‌స్తున్న కీర్తి సురేష్‌

మ‌హాన‌టి సినిమాతో జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకున్న టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్. ఇటీవ‌ల త‌న చిర‌కాల ప్రియుడిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి చేసుకున్నా కానీ సినిమాల జోరు మాత్రం తగ్గించ‌లేదు కీర్తి. ఇటీవ‌ల వ‌రుణ్ ధావ‌న్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంత‌గా ఆడ‌క‌పోయినా కీర్తి స్టార్‌డ‌మ్‌కు ఎలాంటి ఢోకా లేదు. అయితే తాజాగా మ‌రో వెబ్ సిరీస్‌తో కీర్తి ముందుకు రాబోతోంది. ధర్మ రాజ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్‌రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ అక్క‌. ఈ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్ప‌టికే దీని షూటింగ్ కూడా పూర్త‌యిపోయింది. ఈ వెబ్ సిరీస్‌లో కీర్తితో పాటు రాధికా ఆప్టే న‌టిస్తోంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. మ‌రి ఈ వెబ్ సిరీస్ తో అయినా కీర్తి బాలీవుడ్‌లో హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *