సినీ తారలు కాజల్, తమన్నాలు క్రిప్టో కరెన్సీ స్కామ్ లో ఇరుక్కున్నట్లు సమాచారం. ఇటీవల కొద్ది కాలంగా క్రిప్టో కరెన్సీ మోసాలు బయటపడుతున్నా విషయం తెలిసిందే. పలువురు బాధితులు బయటకు వచ్చి తమకు జరిగిన నష్టంపై కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేశారని పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి విశ్రాంత ఉద్యోగి కాజల్, తమన్నాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022లో కోయంబత్తూర్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్లో కాజల్, తమన్నా పాల్గొన్నారు. దీంతో కాజల్, తమన్నాలను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. సుమారు రూ.60 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.