అంద‌రితో ద‌య‌తో ఉండాలంటున్న‌ ర‌ష్మిక

టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. ఫిబ్ర‌వ‌రి 14న ర‌ష్మిక న‌టించిన చావా మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కాలిగి గాయ‌మైనా కూడా ర‌ష్మిక ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చాలా వైర‌ల్ అయ్యాయి. అయితే కొంద‌రు ర‌ష్మిక‌ను ట్రోల్ కూడా చేశారు. ఇటీవ‌ల సీక్రెట్ ల‌వ‌ర్స్ ర‌ష్మిక‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ఉన్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో విజ‌య్ న‌డుచుకుంటూ వ‌చ్చి కారు ఎక్క‌గా, వెన‌కాల ర‌ష్మిక స్టాండ్ సాయంతో న‌డుచుకుంటూ వ‌చ్చింది. దీంతో నెటిజ‌న్లు విజ‌య్‌పై నెగ‌టివ్‌గా కామెంట్లు చేయడం ప్రారంభించారు. క‌నీసం ర‌ష్మిక‌కు సాయం కూడా చేయ‌లేదంటూ మండిప‌డ్డారు. ఇదిలా ఉంటే ర‌ష్మిక త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్టు చేసింది. అంద‌రితో ద‌య‌తో ఉండాల‌ని అందులో పేర్కొంది. ఈ రోజుల్లో ద‌య చాలా త‌క్కువైంద‌ని పోస్టు చేసింది. దీనికి త‌న రెండు ఫొటోలు కూడా జ‌త చేసింది. అందులో కైండ్‌ఫుల్ అని రాసి ఉన్న టీ ష‌ర్ట్ వేసుకుంది. ర‌ష్మిక ఇది విజ‌య్‌ను ఉద్దేశించి పెట్టిందా అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *