విడాకుల కేసుకు డుమ్మా!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుస్‌, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య విడాకుల విష‌యం ఎంత చ‌ర్చ‌నీయాంశ‌మైందో అంద‌రికీ తెలిసిందే. 2022లో ఈ స్టార్ క‌పుల్ విడాకులు తీసుకుంటున్నాట్లు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రి ఇష్ట ప్ర‌కార‌మే విడిపోతున్నామ‌న్నారు. ధనుష్ , ఐశ్వర్యలకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పిల్లలు కూడా వారి నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ క్ర‌మంలో 2022 నుంచి తల్లిదండ్రులతో ప్రత్యామ్నాయంగా జీవిస్తున్నారు. ధనుష్-ఐశ్వర్య విడిపోవాలనే నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు సోషల్ మీడియాలో ఊహాగానాలు ఉన్నప్పటికీ ఐశ్వర్య- ధనుష్ ఇద్దరూ తమ విడాకుల కారణాన్ని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఈ కేసులో ఐశ్వర్య ధనుష్ ఈ ఏడాది విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా… వారిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. సోమ‌వారం ధనుష్-ఐశ్వర్యల విడాకుల కేసు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విచారణకు వ‌చ్చింది. ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసును అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మ‌రో వైపు వీరు క‌లుస్తున్నారంటూ కొద్ది రోజులు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే, ధ‌నుష్ ప్రేమాయ‌ణాలు, ఐశ్వ‌ర్య‌కు జ‌యం ర‌వికి పెళ్లి అంటూ ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *