బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా బ్రేక‌ప్‌!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి బాలీవుడ్‌కు చెక్కేసింది మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా. తెలుగు నుంచి హిందీకి వెళ్లి స‌క్సెస్ అయిన‌ అతికొద్ది మంది తార‌ల్లో ఒక‌రిగా నిలిచింది. సినిమాలు, స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ల‌క్కీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. త‌మ‌న్నాకు నార్త్ ఇండియాలో సైతం ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే త‌మ‌న్నా బాలీవుడ్ హీరో విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ షిప్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాల్ వేసుకొని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ తిరిగే వారు. ఇప్పుడో అప్పుడో పెళ్లి కూడా చేసేసుకుంటార‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీరిద్ద‌రు విడిపోయిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. దీనికి కార‌ణం సోష‌ల్ మీడియాలో ఒక‌రి ఫోటోలు ఒక‌రు తీసివేయ‌డ‌మేన‌ని టాక్ న‌డుస్తోంది. 2023లో విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ కోసం తొలిసారి త‌మ‌న్నా, విజ‌య్‌వ‌ర్మ‌ కలిసి ప‌ని చేశారు. ఈ సిరీస్ షూటింగ్ టైంలోనే ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. త‌మ‌న్నా, విజ‌య్ ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు కూడా. నాకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నా. నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్‌వర్మ ఆ ప్రపంచంలోకి వచ్చాడు. తను నన్నెంతో అర్థం చేసుకున్నాడు. అన్ని విషయాల్లో గౌరవం ఇస్తాడు.. అంటూ త‌మ‌న్నా విజయ్ ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తింది. కానీ ఇప్పుడు ఇద్ద‌రూ విడిపోవ‌డంతో దీనికి కార‌ణం ఏమై ఉంటుందా అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. కాగా బ్రేక‌ప్‌పై అటు త‌మ‌న్నా గానీ ఇటు విజ‌య్ గానీ అధికారికంగా ఎలాంటి విష‌యం చెప్ప‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *