ఇటీవల ఏపీలో జరిగిన పలు అత్యాచారాలు మరువకముందే కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. కోసిగి మండలం కడదొడ్డిలో ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై గ్రామ సర్పంచితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాళ్లోకి వెళ్తే… గ్రామంలోని ఓ తల్లిదండ్రులు ఎనిమిదో తరగతి చదువుతున్న తమ కూతురిని బంధువుల దగ్గర వదిలి ఉపాధి నిమిత్తం కర్ణాటకకు వలస వెళ్లారు. ఈ క్రమంలో బాలిక సోమవారం ఇంట్లో నిద్రిస్తుండగా గ్రామ సర్పంచి హుసేనితో పాటు మరో ఇద్దరు ఆమెపై అత్యాచారయత్నం చేశారు. బాలిక తాత కేకలు వేయడంతో సర్పంచి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.