ఏపీలో డయేరియా విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది. విజయనగరం జిల్లాలో ఎక్కువ మంది డయేరియా బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 మంది డయేరియాతో మృతి చెందగా తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరంలోని గుర్ల మండలం నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో డయేరియా మృతుల సంఖ్య 11కు చేరింది. జిల్లా వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో సుమారు 200లకు పైగా ప్రజలు డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు మరణాల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.