అతిగారాబంతో పెరిగిన పిల్లలు తల్లిదండ్రులు చిన్నగా కోప్పడ్డా ఆత్మహత్య చేసుకొని వారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడం ఆందోళనకరంగా మారింది. తాజాగా కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తండ్రి మందలించాడనే కారణంతో పదేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో ఈ విషాదకర ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన ఎల్ల శేఖర్ తన కుమారుడు కృష్ణ ఐదు రోజులుగా బడికి వెళ్లకపోవడంతో మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ పురుగుల మందు తాగేశాడు. తల్లిదండ్రులు గమనించి అంబులెన్స్లో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.