పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగిన ఓ ఘటన భక్తుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓ వ్యక్తి కొండపై మద్యం తాగి హల్చల్ చేయడంతో భక్తులు షాకయ్యారు. అంతే కాకుండా అక్కడే ఓ మహిళతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగి గందరగోళం సృష్టించాడు. వివరాళ్లోకి వెళ్తే… తిరుమలలో ఆలయ మాఢ వీధుల్లో ఓ వ్యక్తి మద్యం తాగి సంచరిస్తున్నాడు. ప్రశ్నించిన వారిని ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే ఇక్కడే మందు కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయి ప్రవర్తించాడు. పోలీసులను కూడా మీకు నేను మద్యం అమ్ముతా అంటూ కేకలు వేశాడు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని , ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారుల్ని కోరుతున్నారు.