హైదరాబాద్లో దారుణం జరిగింది. ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఐదుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. రంగారెడ్డి – నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.