ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇంటి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రెండు సార్లు ఆయన ఇంటి సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. అప్పమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. వైయస్ జగన్ ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు వైసీపీ నేతలు అంటున్నారు. కొందరు యువకులు కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.