ఇటీవల బర్డ్ ఫ్లూతో తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మారినప్పటికీ మళ్లీ తెలంగానలో బర్డ్ ఫ్లూతో కోళ్ల మరణం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారు బర్డ్ ఫ్లూ అని నిర్దారించారు. వరుసగా రెండు సార్లు భారీ ఎత్తు బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులకు రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. దీంతో యజమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి పూడ్చి పెట్టారు. కోడి గుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని అధికారుల ఫామ్ యజమానులను ఆదేశించారు.