ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తన పేరు రాలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో ఇటీవల జనవరి 23న గ్రామ సభ జరిగింది. ఈ సభలో తనకు ఇల్లు రాలేదనే మనస్థాపంతో రైతు కుమ్మరి నాగేశ్వరరావు అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు ఏటూరు నాగారం సామాజికాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు వరంగల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.