తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న పార్టీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫాంహౌస్లో పది మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా ఓ మంత్రిపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. త్వరలో వీరు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ భేటీ పై తీవ్ర చర్చ నడుస్తోంది.