తిరుమ‌ల హుండీలో న‌గ‌దు చోరీ

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యంలోని హుండీలో న‌గ‌దు చోరీ జ‌ర‌గడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 23న ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆల‌య భ‌ద్ర‌తా సిబ్బంది చోరీని గుర్తించారు. ఆలయంలోని స్టీల్‌ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేశాడు. అయితే అదే రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు నిందితుడిని ప‌ట్టుకున్నారు. హుండీలో నుంచి దొంగిలించిన రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *