ప్రియుడితో అక్రమ సంబంధం మోజులో ఓ మహిళ తన భర్తనే కడతేర్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఏవీ నగరంలో నివసించే ఓ వివాహిత మహిళ స్థానిక రిఫరల్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు అక్కడే పని చేసే ప్రశాంత్తో కలిగిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న మహిళ భర్త మధు భార్యతో గొడవకు దిగాడు. ఈ విషయంపై తరచూ భార్యా భర్తలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రియుడు ప్రశంత్తో కలిసి భర్తను చంపేయాలని సదరు మహిళ ప్లాన్ వేసింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 19న భర్తకు ఆహారంలో విషం పెట్టి చంపేసింది. భర్త సాధారణంగా మరణించినట్లు అందరినీ నమ్మించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే దీనిపై విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. మధు భార్యే అతడిని చంపేసిందన్న విషయం తెలిసింది.