ఆన్లైన్ బెట్టింగ్స్ తో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. భారీగా అప్పులు చేసి నష్టపోయి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కొద్ది రోజులుగా ఆన్ లైన్ బెట్టింగ్స్ కు అలవాటు పడ్డాడు. తన దగ్గర ఉన్నదంతా కోల్పోయినా అప్పులు చేసి మరీ బెట్టిగ్స్ యాప్ లలో పెట్టేవాడు. ఈ క్రమంలో సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోయాడు. తీవ్ర మనో వేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.