మాదాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాళ్లోకి వెళ్తే… పశ్చిమబెంగాల్కు చెందిన యువతి రితోజి బసు ఏడాది కాలంగా హర్ష్ అనే యువకుడితో కలిసి గచ్చిబౌలిలోని సిద్ధిక్నగర్ వద్ద ఓ హాస్టల్లో ఉంటోంది. మంగళవారం రాత్రి హాస్టల్ భవనం ఎక్కిన యువతి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమీ తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.