చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీర రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వీరరాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన రాజేంద్రనగర్ కోర్టు సూచించింది. ఫిబ్రవరి 8వ తేదీన వీరరాఘవ రెడ్డి రంగరాజన్ ఇంటికి వెళ్లి తాను రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నానని మద్దతు కోరాడు. అదే సమయంలో రంగరాజన్పై వీరరాఘవ రెడ్డి సైన్యం దాడి చేసింది. మొయినాబాద్ పోలీసులు ఈ కేసులో వీరరాఘవ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన అనంతరం ఏపీ, తెలంగాన నుంచి పలువురు ప్రముఖులు రంగరాజన్ను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫోన్ చేసి మాట్లాడారు.