విశాఖపట్నంలో దారుణ ఘటన జరిగింది. ఆటోలో వెళ్తున్న ఓ అంగన్ వాడీ టీచర్పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో సదరు యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాస్నగర్లో అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగం తన స్నేహితురాలితో కలిసి ఆటో ఎక్కింది. ఆటో ప్రయాణిస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. అకస్మాత్తుగా ఆటోలో మంటలు చెలరేగాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల నాలుగు రోజుల కిందటే విశాఖలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై యాసిడ్ దాడి జరిగింది. మరో సారి యాసిడ్ దాడి వార్తతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.