ఇటీవల పలు కేసుల నేపథ్యంలో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కాగా, పోసానికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందర పాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే, ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతం దూషించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఫిబ్రవరి 28న రాత్రి హైదరాబాద్లోని పోసాని ఇంట్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.