హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ ప్రాణాలు కోల్పోయారు. వివరాళ్లోకి వెళ్తే… తెలంగాణ డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీ బాబ్జీ లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్లో నివాసముంటున్నారు. లక్ష్మారెడ్డిపాలెంలో బాబ్జీ ఉదయం వాకింగ్కు వెళ్లారు ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాబ్జీ మృతితో ఆయన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.