తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు సోనియా మంత్రి కొండా సురేఖను ప్రశంసించారు. దాదాపు 42 ఏళ్ల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయన్నారు. హైందవ ధర్మంలో త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. మంత్రి కొండా సురేఖ తనకు ప్రసాదం, పవిత్ర నదీ జలాలను పంపించిందుకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.