ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో తనపై నమోదైన పోలీసు కేసులపై సినీ నటుడు అల్లు అర్జున్ ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు. స్థానికంగా సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.