వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు ప్లాన్‌

ఏపీలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌రుస‌గా వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం, అరెస్టులు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీ, నందిగం సురేష్‌, పోసానితో స‌హా ప‌లువురిని అరెస్ట్ చేశారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు కోసం ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లినట్లు స‌మాచారం. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని హైకోర్టుకు చెప్పి, మిథున్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో హైకోర్టు శుక్ర‌వారం మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే ఏపీ సీఐడీ బృందాలు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఢిల్లీకి వెళ్లాయి. మరోవైపు మిథున్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *