నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ ఫ్లెక్సీల్లో ఉండటం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ల ఫొటోలు సైతం ఆ ఫ్లెక్సీల్లో ఉన్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్న క్రమంలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.