ఏపీలో పెట్టుబడులకు తరలిరావాలని సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. హర్యానా సీఎం ప్రమాణస్వీకార మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతున్నామని పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఏపీ చక్కటి ఎంపిక అని చెప్పారు. ఏపీ వ్యాపారానికి అనుకూలంగా ఉందని, రాష్ట్రంలో వ్యవస్థాపక స్ఫూర్తి, వ్యాపారాలను పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ వ్యాపార పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు చెప్పారు. దేశంలో, ఏపీలో పెట్టుబడులకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు.