ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళ పర్యటనలో భాగంగా కొచ్చికి చేరుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటన చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించనున్నారు. కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, తితిదే బోర్డు సభ్యుడు ఆనంద్సాయి ఉన్నారు.