ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారత దేశ ఆలయాల సందర్శనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ తమిళనాడులోని మధురైలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం పవన్ తన కుమారుడు అకీరా నందన్ తో కలిసి పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని పవన్ కు అందజేశారు.