వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. ఇటీవల ఓ కిడ్నాప్ కేసు విషయంలో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. కాగా, వంశీ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వంశీ టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హై కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను నేడు విచారించిన హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఈ కేసు విషయంలో బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.