కేంద్ర‌మంత్రితో నారా లోకేశ్ భేటీ

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో వ‌రుస భేటీల‌తో బిజీగా ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండో రోజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర‌మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో క‌లిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన‌ట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరిన‌ట్లు చెప్పారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ గారికి వివరించాన‌ని, ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చార‌ని త‌న పోస్టులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *