ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలతో జరిగిన సమావేశంలో నిమ్మల మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కూటమి నేతలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. జగన్ హయాంలో పెండింగ్లో ఉన్న రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసి, నిర్వాసితులను రూ.1000 కోట్ల పరిహారం అందించినట్లు చెప్పారు.