ఏపీ కేబినేట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపీ కేబినేట్ స‌మావేశం జ‌రిగింది. సుమారు రెండు గంట‌ల‌కు పైగా ఈ స‌మావేశం జ‌రిగింది. ఈ భేటీలో కేబినేట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోద‌ముద్ర వేసింది. చెత్తపన్ను రద్దు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్‌ సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచాలని కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ఉచితంగా ఇసుక పంపిణీకి ఆమోద ముద్ర వేస్తూ, ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతించారు. దీంతో పాటు స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై సుధీర్ఘ చ‌ర్చ సాగిన‌ట్లు స‌మాచారం.

 


		

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *