ఏపీలో రేపు జరగబోయే గ్రూప్ 2 పరీక్షలపై ఏపీపీఎస్స కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా నిర్ణయించిన తేదీలోనే టైం ప్రకారమే జరుగుతాయని వెల్లడించింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడుతున్నాయంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 23న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ – 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. అభ్యర్థులు ఎవరూ ఫేక్ న్యూస్ నమ్మి మోసపోవద్దని చెప్పారు. కనీసం 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.