భారత పార్లమెంట్లో అరకు కాఫీ స్టాళ్లు నేడు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీలు బ్రేక్ ఫాస్ట్ చేసే సంగం క్యాంటీన్లో ఈ స్టాళ్లు ఏర్పాటు చేశారు. సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద రెండు స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 28 వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి.