ఏపీలో ఆశ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఛలో విజయవాడకు నేడు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న ఆశ కార్యకర్తలతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ ధర్నాచౌక్లో ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ ఆశ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. దీంతో విజయవాడలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆశ వర్కర్లు తమ జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ వయసుకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆశ వర్కర్ల వయోపరిమితిని రెండేళ్లకు పెంచి మెటర్నిటీ లీవులు మంజూరు చేసింది. కానీ, తమకు జీతాలు మాత్రం పెంచితే చాలని ఆశ వర్కర్లు చెబుతున్నారు.