ఏపీలో విచ్చ‌ల‌విడిగా బెల్టు షాపుల దందా

ఏపీలో నూత‌న మ‌ద్యం పాల‌సీ అమ‌లులోకి వ‌చ్చాక బెల్టు షాపులు విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండ‌దండ‌ల‌తో కొంద‌రు ఇష్టారీతిన మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌డుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుతో భారీగా బెల్ట్ దుకాణాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. ఇండ్ల మ‌ధ్య‌లో రోడ్డు ప‌క్క‌నే మ‌ద్యం దుకాణాలు తెరిచేస్తున్నారు. మార్కెట్‌లో కూర‌గాయ‌లు అమ్మిన‌ట్లు ఓపెన్‌గా మ‌ద్యం బాటిళ్లు పెట్టి అమ్మేస్తున్నారు. పాతవూరు, సంతమార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. సంత మార్కెట్ వద్ద ఓ వ్య‌క్తి ఓపెన్‌గా మ‌ద్యం విక్ర‌యిస్తున్న వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అధికారులు ఇలాంటి బెల్ట్ షాపుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *