తెలంగాణ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే సినీ నటుడు అల్లు అర్జున్ను టార్గెట్ చేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకొని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలైందని, ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ తరలింపునకు ప్లాన్ చేశారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసి వారి ఇంట్లో వాళ్లను, పిల్లలను భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు.