ఇటీవల కాలంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అతడిని అదుపులోకి తీసుకొని విమానాశ్రయ సిబ్బంది తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.