బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమై అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సి వ్యూహాన్ని వివరించారు. అసెంబ్లీలో పలువురు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ను కలవడం ఆసక్తిరేపింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ను కలిసి తన సోదరుడి వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే మంత్రి తుమ్మల కేసీఆర్ ను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.