బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లిలోని ఫార్మ్ హౌస్లో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయని విషయం తెలిసిందే. అయితే మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నేటి సమావేశంలో దీని గురించే చర్చించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.