మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహంలో రేవంత్ రెడ్డిని కలిసి ఆయన మనవరాలు వివాహానికి ఆహ్వానించారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు , బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు సైతం మల్లారెడ్డి ఆహ్వాన పత్రికలు అందజేశారు. కాగా, ఎన్నికలకు ముందు వరకు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై చాలా సార్లు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలై రేవంత్ సీఎం అయ్యాక సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డినే కలవడం ఆసక్తికరంగా మారింది.