రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ పూర్తి చేయాలని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని పేర్కొన్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి , సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.