జ‌గ‌దీష్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాలి – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాన్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అసెంబ్లీలో ఇటీవ‌ల అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ జ‌గ‌దీష్ రెడ్డిని స‌స్పెండ్ చేశారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని జ‌గ‌దీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *